బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బోనగిరి నిరంజన్ గుప్తా ప్రమాణ స్వీకారం

Published: Friday December 30, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా
బెల్లంపల్లి నియోజకవర్గ భీమినీ మండల కేంద్రానీకి చెందిన బోనగిరి నిరంజన్ గుప్తాను, చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, గురువారం వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్దిక, వైద్య ఆరోగ్యశాఖ, దేవాదాయ శాఖ మంత్రుల సమక్షంలో సంబంధిత అధికారులచే పట్టణంలోని నెంబర్ టూ  క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం లో తనతో పాటు ఎంపికైన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు.
 ప్రమాణ స్వీకార అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లు, తనపై నమ్మకంతో పదవిని కట్టబెట్టినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నియోజకవర్గంలోని రైతులకు, మార్కెట్ సమస్యల విషయంలో, నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ రైతులను, అన్ని విధాల విధాల ఆదుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. చైర్మన్ పదవి  వచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.