దెందుకూరు పిహెచ్సికి బాధ్యతలు తీసుకున్న వైద్యఅధికారి డా.

Published: Wednesday January 04, 2023
. బోడ సాయి పృద్విరాజ్ నాయక్ . మధిర జనవరి 3 రూరల్  ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో దెందుకూరు గ్రామంలో మండలం పరిధిలో పిహెచ్సి దెందుకూరు నందు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నియమించిన రెగ్యులర్ వైద్యుల నియామకంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పిహెచ్సి దెందుకూరుకు  డాక్టర్ బోడ. సాయి పృథ్విరాజ్ నాయక్ పిహెచ్సిలో విధుల్లో నిన్నజాయిన్ అయ్యారు. వారిని పిహెచ్సి పారా మెడికల్ సిబ్బంది   వారికి స్వాగతం పలికి మంగళవారం ఉదయం పుష్ప గుచ్చాలతో  స్వాగతం పలికినారు. సిబ్బంది అందరూ నూతన సoవత్సర శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలియపరిచినారు.
 ఈ కార్యక్రమంలో డా. కనకపూడి సునీత మధిర -2 బస్తి దవఖాన వైద్యురాలు, పిహెచ్సి పారామెడికల్ సిబ్బంది పిహెచ్ఎన్ గోలి రమాదేవి హెచ్ఇఒ యస్ గోవింద్ పిహెచ్ఎన్ పద్మావతి హెచ్ఎస్ సుబ్బలక్ష్మి హెచ్వి కౌసల్య, స్టాఫ్ నర్సులు సృజన  రజిని, ఎఎన్ఎమ్ లు వి విజయకుమారి జయమ్మ, భారతి,  లక్ష్మి, లీల, జె విజయలక్ష్మి, విజయ,రాజేశ్వరి నాగమణి, అరుణ, సునీల హెచ్ఎ లు శ్రీనివాస్ నాగేశ్వరావు ఎల్టి నరేంద్ర  ఫార్మాసిస్ట్ వీనిల పాల్గొన్నారు.