ఉయ్యాల సూకమార్ జన్మదిన సందర్బంగా విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

Published: Thursday August 04, 2022

కోరుట్ల, ఆగష్టు 03 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణం లోని అంబేడ్కర్ నగర్ లో ఉయ్యాల నర్సయ్య కుమారుడు కీ. శే. ఉయ్యాల సూకమార్ జన్మదిన సందర్బంగా బుధవారం రోజున అంబేద్కర్ నగర్ స్కూల్ లో120 విద్యార్థులకు కి  నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్, నల్ల పలకలు, చాక్ పీస్ లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సుకుమార్ చిన్న వయస్సులోనే మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన జన్మదినం మరియు వర్ధంతి ఒకే రోజు రావడం వలన జయంతి వర్ధంతి ల సందర్బంగా ప్రతీ సంవత్సరం వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూతురు ఉయ్యాల నైనిక, కొడుకు వియన్ తేజ్, తండ్రి ఉయ్యాల నర్సయ్య, వార్డ్ కౌన్సిలర్ బలిజ పద్మ రాజారెడ్డి, బాబాయ్ ఉయ్యాల శోభన్, గిన్నెలా శ్రీకాంత్, బింగి సాగర్, బోల్లే గంగాధర్, చిట్యాల కర్ణాకర్, సామల్ల వేణు, ఉయ్యాల మాదేశ్, బోళ్లే పూరషోతం, మరియూ ప్రధానోపాధ్యాయులు అడ్లగట్ల గంగాధర్, చిరంజీవి, మరియూ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.