అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీడీవో రాజ శ్రీనివాస్
Published: Wednesday March 24, 2021
మల్లాపూర్, మార్చి 23 ( ప్రజాపాలన ప్రతినిధి ) : మల్లాపూర్ మండలం కుస్థాపూర్, రత్నపూర్ గ్రామాలలో పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన ఉపాధిహామీ పథకం, నర్సరీ, స్మశాన వాటిక, వర్మి కంపోస్టు షెడ్, పల్లెప్రకృతి వనం వంటి పనులను మంగళవారం ఎంపీడీవో రాజశ్రీనివాస్ పరిశీలించారు. ఉపాధి హామీ పథకం పనులను నిర్వహిస్తున్న అధికారులను, కూలీలను పనుల గురించి వివరంగా అడిగి తెలుసుకొని, హరితహారం కార్యక్రమానికి సిద్ధం చేసే మొక్కల సంరక్షణ బాధ్యతగా చేపట్టాలని ఎంపీడీవో అన్నారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఎపీవో సతీష్, గ్రామ సర్పంచులు సరికెల లక్ష్మీ - మహిపాల్, మేడి అనూష - వినోద్ కుమార్, ఎంపీటీసీ దేవా ముత్తమ్మ - మల్లయ్య, పంచాయతీ కార్యదర్శులు నరేష్, భారతి, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: