మరమ్మత్తులకు నోసుకొని బోరు
మధిర నవంబర్ 1 (ప్రజా పాలన ప్రతినిధి) పట్టణంలోని లడక బజారు ప్రజలకు తాగునీరు అందించే బోరు గత నాలుగేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోలేదు. అనేకసార్లు ఆ ప్రాంత ప్రజలు అధికారులు దృష్టికి తీసుకెళ్లిన బోరును మరమ్మత్తు చేసేవారు కరువయ్యారు. లడక బజారులోని ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి గతంలో మాజీ వార్డు కౌన్సిలర్ పంతంగి నాగయ్య ఇంటి సమీపంలో బోరు ఏర్పాటు చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా బోరు పాడే ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇటీవల మిషన్ భగీరథ సిబ్బంది పైపులైన పేరుతో రహదారులు తవ్వటంతో మున్సిపల్ పైప్ లైన్ ధ్వంసం అయింది దీంతో ప్రాంతానికి ప్రస్తుతం తాగునీటికి ఇబ్బందలు ఏర్పడ్డాయి. కనీసం బోరు నుండైనా తాగునీరు తెచ్చుకుందామని అనుకున్న ప్రజలకు పాడైపోయిన బోరు దర్శనమిస్తుంది. సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని పాడైపోయిన బోరుకు మరమ్మతులు చేయించి తాగు నీటికి ఇబ్బంది లేకుండా చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Share this on your social network: