మాదిగ విద్యార్థి జాతీయ మహాసభ ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం కూరపాటి ప్రభాకర్ మ

Published: Friday December 03, 2021

ఎర్రుపాలెం డిసెంబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలం స్థానిక జూనియర్ కళాశాలలో చలో ఢిల్లీ కరపత్ర ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో కూరపాటి సునీల్ మాదిగ అధ్యక్షతన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కూరపాటి ప్రభాకర మాదిగ పాల్గొని కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోరుకొండ ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ మాదిగ విద్యార్థి జాతీయ మహాసభ విజయవంతం చేయాలని వర్గీకరణ తోనే మాదిగల అభివృద్ధి సాధ్యమని, మాదిగలు అందరూ కలిసి ఉంటే వర్గీకరణ జరుగుతోందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 14న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో మాదిగ విద్యార్థులు అందరూ భాగస్వాములు కావాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక జూనియర్ కళాశాల కమిటీ సభ్యులు మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.