దిరిశాల భద్రయ్య సేవలు మరువలేనివి.. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్..

Published: Wednesday March 01, 2023
తల్లాడ, ఫిబ్రవరి 28 (ప్రజా పాలన న్యూస్): జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, అన్నారుగూడెం గ్రామ అభివృద్ధికి స్వర్గీయ దిరిషాల భద్రయ్య చేసిన సేవలు మరువలేనివని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  మానవతారాయ్ అన్నారు.
అన్నారుగూడెంలో సాయిబాబా 15వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆలయ అభివృద్ధి కోసం ఆనాడు భద్రయ్య అనేకమంది దాతల సహకారంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటని, ఆయన ఆశయ సాధన కోసం కార్యకర్తలు పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం మానవతారాయిని ఆలయ కమిటీ చైర్మన్ మారెళ్ళ లక్ష్మణరావు, కాంగ్రెస్ నాయకులు శాలువాలు పూలమాలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్, సాందీపులు, పునాటి సత్యం, దుగ్గుని గోపయ్య, పాపిని మధు,మల్లిడి శేషయ్య,ఆపద రామారావు, తదితరులు పాల్గొన్నారు.