ఆర్టీసి డిపో ని లాభాల బాటలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అవగాహన సదస్సులో కోరు

Published: Monday January 09, 2023

కోరుట్ల, జనవరి 08 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల డిపో మరియు మెట్ పల్లి డిపోల సూపర్ వైజర్, కొత్తగా నియమింపబడిన ప్యాసింజర్ గైడ్ లకు కోరుట్ల మరియు మెట్పల్లి ఇంచార్జ్ డిపో మేనేజర్ లక్ష్మీ ప్రసూన, జగిత్యాల డిపో మేనేజర్ నరసప్ప  ఆధ్వర్యంలో డిప్యూటీ ఆర్.ఎం.ఓ చందర్ రావు అవగాహన కార్యక్రమంను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్ డిపోట్స్ ప్రాఫిట్ ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు  కష్టపడి పని చేయాలని,నష్టాల్లోంచి లాభాల్లోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి  చేయాలని అలాగే ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా, ప్రేమగా మాట్లాడాలని ప్రయాణికుల మన్ననలను పొందుతూ ఆర్టీసి సంస్థకి అత్యధిక ఆదాయాన్ని తీసుకువచ్చి లాభాల బాటలో తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల డిపో మేనేజర్ లక్ష్మీప్రసూన, జగిత్యాల డిపో మేనేజర్ నర్సప్ప, మెట్పల్లి డిపో సిఐ రాజయ్య, రమేష్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.