రోడ్డు ప్రమాదం పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

Published: Friday November 04, 2022
*ప్రమాదంపై అరా...
*కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
వికారాబాద్ బ్యూరో 3 నవంబర్ ప్రజా పాలన : వికారాబాద్‌ జిల్లా ధారూర్ మండలంలోని కేరెళ్లి – బాచారం వద్ద గురువారం ఆటోను లారీ ఢీ కొన్న సంఘటనలో నలుగురి మృతి పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల, ఎస్ పి కోటిరెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
పెద్దేముల్ మండలం మదనంతాపూర్ తండాకు చెందిన వ్యక్తులు ఆటోలో వెళ్తుండగా లారీ ఢీకొనడంతో  అక్కడిక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా,మరొకరు ఆస్పత్రిలో మృతి చెందగా పలువురు గాయపడటం బాధాకరమని అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మంత్రి కోరుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.