విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి ** బిసి గురుకులాల ఆర్ సి ఓ గోపీనాథ్ **

Published: Thursday February 23, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 22 (ప్రజాపాలన, ప్రతినిధి) : విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాల ఆర్ సి ఓ గోపీనాథ్ సూచించారు. బుధవారం మండలంలోని బాబా పూర్ బీసీ గురుకుల పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమంలో ఎంఈఓ మణు కుమార్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని విద్యలో ముందుకు సాగాలన్నారు. ఎంచుకున్న మార్గం కోసం శ్రమించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కన్వీనర్ వెంకట ప్రసాద్, ప్రిన్సిపాల్ సృజనా దేవి, మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పుష్పలత, అధ్యాపకులు,సిబ్బంది విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.