తాండూర్ ప్రజా పాలన

Published: Wednesday April 19, 2023

 ప్రతినిధి బషీరాబాద్ మండలంలోని  మైల్వార్ ,,మైలరం తాండ, కంసాన్ పల్లి ,ఎక్ మై, గ్రామాలలో పల్లె పల్లెకు  రోహిత్ రెడ్డి కార్యక్రమంలో ఆయన పాల్గొని వివిధ పనులకు ప్రారంభం చేశారు. తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 50 వేల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రతి గ్రామానికి 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రులు మాట్లాడి నిధులు మంజూరు చేయించు చుకుని పబ్లిక్ పనులను ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు .కెసిఆర్ నాయకత్వంలో పల్లె ప్రాంతాలు అభివృద్ధి పథకం నడుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు రవీందర్ సింగ్, ఎంపిటిసి వైస్ ఎంపీ పి అన్నపూర్ణ, ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.