స్నేహ టీవీ ప్రజాపాలన క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపీపీ వజ్జా రమ్య..

Published: Tuesday January 18, 2022
పాలేరు జనవరి 17 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి అనతికాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన స్నేహ టీవీ, ప్రజాపాలన దినపత్రిక నూతన సంవత్సర 2022 క్యాలెండర్ ని నేలకొండపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ వజ్జా రమ్య, తాసిల్దారు దారా ప్రసాద్, ఎంపీడీవోజమాలరెడ్డి, అధికారుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేలకొండపల్లి తహసిల్దార్ దారా ప్రసాద్ మాట్లాడుతూ సమస్యల పరిష్కార దిక్సూచిగా స్నేహ టీవీ ప్రజాపాలన దినపత్రిక నిలిచిందన్నారు. మున్ముందు బడుగు బలహీన వర్గాల సామాన్య ప్రజానీక సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగాలని అన్నారు. నేలకొండపల్లి టిఆర్ఎస్. పార్టీ మండల. అధ్యక్షులు. ఉన్నాం బ్రహ్మయ్య, మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారంలో ప్రజా పాలన ముందు వరుసలో నిలుస్తుందని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళుతున్న ప్రజాపాలన దినపత్రిక ను పలువురు అభినందించారు కార్యక్రమంలో నేలకొండపల్లి పిఎసిఎస్ చైర్మన్ కోటి సైదా రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు. వజ్జా శ్రీనివాస రావు, కోనాయి గూడెం రైతు సమన్వయ సమితి అధ్యక్షులు. మేకల వెంకటేశ్వర్లు. ఎంపిడిఓ కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు