రంజాన్ కానుకలను అందించిన కౌన్సిలర్లు

Published: Friday April 29, 2022
బెల్లంపల్లి ఏప్రిల్ 28 ప్రజాపాలన ప్రతినిధి:  రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగ సందర్భంగా, ముస్లిం సోదర, సోదరిమణులకు, అందిస్తున్న రంజాన్ కానుకలను బెల్లంపల్లి పట్టణంలోని ఒకటవ వార్డు, రెండో వార్డు, కౌన్సిలర్లు సూరం సంగీత బానేష్, షేక్ అప్సర్, లు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కె, చంద్రశేఖర రావు, ముస్లిం మైనారిటీల, సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే అన్ని వర్గాలకు ఇచ్చినట్లుగా, మైనార్టీ వర్గాలకు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లోను, సంక్షేమ కార్యక్రమాల్లోనూ, ప్రాతినిధ్యం చూపుతున్నారని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వారన్నారు, ఈ కార్యక్రమంలో రెండో వార్డ్ కౌన్సిలర్ షేక్ అప్సర్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ వాజీద్, మైనార్టీ పట్టణ అధ్యక్షులు, ఎండీ ఎజాజ్, సయ్యద్ సాజిద్, సయ్యద్ ఫుల్ ఫాత్, రఫీ, సురేష్, లు పాల్గొనగా, ఒకటో వార్డులో వార్డ్ కౌన్సిలర్, సూరం సంగీత బాణేష్, తెరాస నాయకులు బానేష్, ఒద్ది సంజీవ్, షరీఫ్, జేఏసీ నాయకులు చింతల రమేష్, తదితరులు హాజరై కానుకలను అందించారు.