వార్డు కార్యాలయంను కేటాయించాలని కార్పొరేటర్ చేతన హరీష్ నిరసన

Published: Friday April 16, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : వార్డు కార్యాలయంను కేటాయించాలని హబ్సిగూడ కార్పొరేటర్ చేతన హరీష్ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఎమ్మెల్యేేే క్యాంపు కార్యాలయం ముందుు చెట్ల కింద హబ్సిగూడ  బీజేపీ కార్పొరేటర్ చేతన హరీీష్ పరిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఉప్పల్ మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు తమకు వార్డు కార్యాలయంను కేటాయించాలని విన్నవించిన అధికారులుు పట్టించుకోవడం లేదని తెలిపారు. గతంలో హబ్సిగూడ కార్పొరేటర్లు వినియోగించుకున్న వార్డు కార్యాలయంను కేటాయించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలుు తదితరులు పాల్గొన్నారు.