పివికి నివాళులు అర్పిస్తున్న మండల పట్టణ కాంగ్రెస్ నాయకులుపివికి భారతరత్న ఇవ్వాలి

Published: Wednesday June 29, 2022

మధిర  జూన్28 ప్రజాపాలన ప్రతినిధిఆర్థికఏఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞశాలి సంస్కరణశీలి పీవీ ముందు చూపుతో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశం ఆర్థికంగా బలోపేతమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా, అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దారా బాలరాజు కౌన్సిలర్లు కోనా ధని కుమార్ మునుగోటి వెంకటేశ్వరావు పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్ మాజీ సర్పంచులు కర్నాటి రామారావు బొమ్మ కంటి హరిబాబు పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్య మైలవరపు చక్రి ఆదిమూలం శ్రీనివాసరావు పాల్గొన్నారు