భారీ వర్షంతో నీట మునిగిన కాలనీలలో పర్యటించిన డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్
Published: Thursday September 29, 2022
మేడిపల్లి, సెప్టెంబర్28 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ మాభవానినాగర్ తో పాటు మిగతా కాలనీలలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షానికి జలమయమైన కాలనీలను డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ పర్యటించారు. నీట మునిగిన కాలనీలో పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ మున్సిపల్ ఏఈ వినిల్ సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: