కోరుట్ల పట్టణ టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగ నూతన కార్యవర్గం ఎన్నిక

Published: Friday October 01, 2021
కోరుట్ల, సెప్టెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం పట్టణ నూతన కార్యవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనీల్ ప్రకటించారు. అధ్యక్షులుగా - జాల వినోదకుమార్, ఉపాధ్యక్షులు- క్యాతం సృజన్, బలిజ శివప్రసాద్, గండ్ర వెంకటేష్, ప్రధాన కార్యదర్శి- పుప్పాలనాగరాజు, కోశాధికారి- సిరికొండ మణిదీప్, సాంస్కృతిక కార్యదర్శి- జక్కుల దీక్షిత్, ప్రచార కార్యదర్శి-చిత్తారి ఆనంద్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ- అలిశెట్టి మధు, సంయుక్త కార్యదర్శి- తల్లపెళ్లి మహేష్, పసుపుల మణికంఠ, యాటం అరుణ్ కార్యవర్గ సభ్యులు- మకునూరి రఘు, షేక్ అప్సర్ అలీ, గుల్ల రవి, అరికంటి సాగర్, మగ్గిడి ప్రవీణ్, కోట సాయి ప్రసాద్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, తమ నియామకానికి సహకరించిన పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనీల్, చైర్ పర్సన్ అన్నం లావణ్య, వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, పట్టణ ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్లకు కృతజ్ఞతలు తెలిపారు, ఆలాగే ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, యువ నాయకులు డా.సంజయ్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జిందం లక్ష్మినారాయణ, సీనియర్ యూత్ నాయకులు ఎండి. సనావోద్దీన్, యటం కృష్ణ, మైనార్టీ యూత్ అధ్యక్షుడు ఎండి.అతీక్, ఎస్.టి సెల్ అధ్యక్షులు రఘు నాయక్ తదితరులు పాల్గొన్నారు