పీజేఆర్ స్టేడియంలో.. సూపర్ స్పైడర్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ను సందర్శించిన బిజెపి నాయకులు

Published: Thursday June 03, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంలో సూపర్ స్పైడర్ వ్యాక్సినేషన్ సెంటర్స్ను రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి 105 డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, స్థానిక నియోజకవర్గ నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది. రవి కుమార్ యాదవ్ వ్యాక్సినేషన్ సెంటర్ పర్యవేక్షకులు ఏఎంఓహెచ్ డాక్టర్ కార్తిక్, సెంటర్లో వ్యాక్సినేషన్ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ సెంటర్లలో అరకొర సదుపాయాలు ఉన్నాయని, ప్రజలకు వ్యాక్సిన్పై సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వాపోయారు. సూపర్ స్పైడర్, వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చేవారికి తెలియజేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు, ఇప్పటికైనా అధికారులు వ్యాక్సినేషన్ సెంటర్లను సందర్శించి సరైన వసతులు కల్పించాలని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ ఎప్పుడు, ఎక్కడ ఇవ్వాలో ప్రజలకు క్లుప్తంగా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, తక్షణమే వ్యాక్సినేషన్ సెంటర్లను సంబంధిత అధికారులు పరిశీలించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, రాష్ట్ర బీజేవైఎం కోశ అదికారి మారబోయిన రఘునాథ్ యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, శ్రీశైలం, రంగస్వామి, రమేష్, ప్రకాష్, విష్ణు పాల్గొన్నారు.