కాజీపురంలో ఘనంగా ఈద్ మిలాప్ కార్యక్రమం

Published: Tuesday May 17, 2022

మధిర రూరల్ మే 16 ప్రజా పాలన ప్రతినిధి ఆదివారం రాత్రిమధిర మండలం కాజీపురంలో జమాత్ ఏ ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.జమాత్ ఏ ఇస్లామి హింద్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ ముజీబ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొని మత సామరస్యాన్ని పాటిస్తే  భిన్నత్వంలో ఏకత్వం సాధ్యమవుతుందని సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు,టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాధం, వైఎస్సార్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ కిషోర్ కుమార్ కేకేడి దొంతమాలమార్కెట్ కమిటీ ఛైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, డాక్టర్ కోట రాంబాబు,ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వేణుగోపాలరావుసూరి,పట్టణ అధ్యక్షుడు వనమా కిరణ్,సీపీఎం మండల కార్యదర్శి మంద సైదులు,సీపీఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవి,నిర్వాహకులు జమీర్, మీరఖాన్,ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.