యూజీడి పనులకు శంకుస్థాపనలు చేసిన జడ్పిటిసి కుమార్ గౌడ్

Published: Wednesday May 12, 2021
గుమ్మడిదల, 11మే21, గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామ పంచాయితీ పరిధిలో గ్రామ సర్పంచ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో జడ్పిటిసి కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడి) పనులకు శంకుస్థాపనలు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పలు అభివృద్ధి పనులలో భాగంగా గ్రామ పంచాయతీ నిధులు సుమారు 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో యూజీడి పనులు శంకుస్థాపన చేశామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని, కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా గ్రామాల అభివృద్దే ద్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకుడు సద్ది విజయ భాస్కర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు