ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమమును సద్వినియోగం

Published: Thursday April 13, 2023
చేసుకోవాలి మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత మధిర రూరల్ ఏప్రిల్ 12 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో 22వ వార్డు నందు"కంటి వెలుగు" కార్యక్రమమును మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత మునిసిపల్ కమీషనర్ రమాదేవి 22వార్డ్ కౌన్సిలర్ కట్ట గాంధీ  చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి దగ్గర ఉంటూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధిలో దూసుకెళ్తూ పలువురికి అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం ని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమం లో డాక్టర్ పృధ్వీ హెల్త్ సూపర్వైజర్, ఆశ వర్కర్ లు, మెప్మా ఆర్పీ, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.