సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Thursday September 09, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ పరిధిలోఆళ్లపాడు, రాపల్లి, తూటికుంట్ల గోవిందపురం, పెద్దబీరువల్లి, బ్రాహ్మణపల్లి, లక్ష్మీపురం, బోనకల్ ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, కలకోట గ్రామాలకు చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి చొరవతో, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారి సిఫారసుతో మంజూరైన 4,64,000/- రూపాయల విలువ చేసే 19 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ అనారోగ్య కారణాల వల్ల చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సందర్భంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నప్పుడు గొప్ప మనసుతో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను పంచటం చాలా ఆనందకరమైన విషయం అని, గ్రామ మండల నాయకులు కార్యకర్తలు కూడా గ్రామాల్లో ప్రజలకు సేవ చేయాలని ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే వారిని తెలియచెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసుకునే విధంగా ప్రోత్సహించాలని అన్నారు