విక్రమ్ లేనిలోటు తీర్చలేనిది

Published: Wednesday February 17, 2021

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఎన్డీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 16, ప్రజాపాలన: విక్రమ్ లేని లోటు పూడ్చలేనిదని, విక్రమ్ మరణం పార్టీకి తీరని నష్టమని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు అన్నారు.మంగళవారం మండలంలోని పోతిరెడ్డిగూడెం గ్రామంలో జరిగిన కామ్రేడ్ వాగబొయిన విక్రమ్ సంతాప సభలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రజల కోసం,ప్రజా సమస్యల పరిష్కారం కోసం కామ్రేడ్ వాగబోయిన విక్రమ్ చిన్న వయసులోనే  న్యూడెమోక్రసీ లింగన్న దళంలో సభ్యునిగా చేరి డిప్యూటీ కమాండర్ స్థాయికి ఎదిగాడని గుర్తుచేశారు. దళంలోనే ఆదర్శ వివాహం చేసుకొని జనజీవన స్రవంతిలో కలిసినప్పటికీ నిత్యం ప్రజల కోసమే పనిచేశారని, ప్రజా సమస్యలపై  న్యూడెమోక్రసీ పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేవారని తెలిపారు.కార్యక్రమంలో  జడ్పీటీసీ వాగబొయిన రామక్క, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ కోరం సీతరాములు, న్యూడెమోక్రసీ రీజనల్ కమిటీ నాయకులు మండల వెంకన్న, పుల్లన్న, నాయిని రాజు, ఈసం శంకర్, పీవైఎల్ రాష్ట్ర నాయకులు పర్శిక రవి. న్యూడెమోక్రసీ నాయకులు పెంటన్న, శాంతయ్య, మంగన్న, వెంకన్న, లాలయ్య, నరేష్, శేఖర్, రంగన్న, కల్తి మల్లన్న, బాబు, సారన్న, లాలు, జగన్, తదితరులు పాల్గొన్నారు.