పోల్కంపల్లి పల్లె ప్రకృతి వనంలో బోర్ వేసేందుకు పని ప్రారంభించిన సర్పంచ్, ఎంపీటీసీ

Published: Friday October 08, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశానుసారం గురువారం మండల ప్రజా పరిషత్ నుండి మంజూరైన నిధులతో పోల్కంపల్లి గ్రామ పల్లె ప్రకృతి వనంలో బోరు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ చెరుకూరి ఆండాలు గిరి, మరియు ఎంపీటీసీ మంగ రవీందర్ కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యుడు షరీఫ్, వార్డు సభ్యులు శశిరేఖ, ధనేశ్వర్, స్వరూప, యాదయ్య, బాలమని, శ్రీను, మనెమ్మ, బాబయ్య, యాదిరెడ్డి, మల్లమ్మ, నరసింహ్మ, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.