బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వ్యక్తికి ఆర్థిక సహాయం

Published: Wednesday March 01, 2023
బోనకల్, ఫిబ్రవరి 28 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని జానకిపురం గ్రామంలో బీఎస్పీ బోనకల్ మండల ఉపాధ్యక్షులు కుమార్తె సాత్విక జన్మదినాన్ని పురస్కరించుకొని మానవసేవే మాధవసేవ అనే మానవతా దృక్పథంతో జానకిపురం గ్రామానికి చెందిన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి గద్దల ఏడుకొండలు (సన్నీ) కి తన వంతు ఆర్థిక సహాయo చేయడం జరిగింది.బీఎస్పీ మండల ఉపాధ్యక్షులు అంతోటి శివ ఈ సందర్భంగా మాట్లాడుతూ తోటి మనుషులకు నిస్వార్థంతో సహాయం చేసినప్పుడు మాత్రమే మానవీయ బంధాలు విలువలు పెంపొందించిన వాళ్లం అవుతామనీ, భావితరాలకు స్ఫూర్తినిచ్చిన వాళ్ళం అవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలుక వెంకటేశ్వర్లు,బీఎస్పీ చింతకాని మండల అధ్యక్షుడు రమేష్, సురేష్,రమేష్ నాయక్ ,అంతోటి వంశి,కోటా,శ్రీకాంత్,స్థానిక పెద్దలు,యువత,వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.