ఇంటింటికి జ్వరం సర్వే చేస్తున్నా మెప్మాలకు మాస్కులు సానిటైజర్ లు పంపిణీ చేసిన మున్సిపల్ చై

Published: Wednesday May 12, 2021
మధిర, మే 11, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధికలెక్టర్ గారి ఆదేశాలమేరకు మధిర పట్టణంలో ఇంటింటికి వెళ్లి జ్వరం సర్వే చేస్తున్నా మున్సిపల్ సిబ్బంది అయినటువంటి మెప్మా RP లకు ఈ రోజు మధిర మున్సిపల్ ఆఫీస్ నందు మాస్కులు మరియు సానిటైజర్లు పంపిణీ చెయ్యడం జరిగింది. చైర్ పర్సన్ శ్రీమతి మొండితోక లత గారు మాట్లాడుతూ ఇంటింటికి వెళ్ళి జ్వరం సర్వే చేస్తున్నా జ్వరం సర్వే టీమ్ కు ప్రజలందరు సహకరించగలరని కోరారు, అలాగే జ్వరం సర్వే చేస్తున్నా టీమ్ వారు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవీంద్ర కుమార్ గారు, మెప్మా RP లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.