ఇబ్రహీంపట్నం జూన్ తేది 26 ప్రజాపాలన ప్రతినిధి.

Published: Monday June 27, 2022

అగ్నిపథ్ ని రద్దు చేయాలని కోరుతు జూన్ 27 న   
ఇబ్రహీంపట్నం చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సత్యాగ్రహదీక్ష లో పాల్గొననున్న మల్ రెడ్డి రంగారెడ్డి 

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పధకాన్ని తక్షణమే రద్దు చేయాలనీ కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు  మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో  జూన్ 27 సోమవారం రోజున ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఇబ్రహీంపట్నం అంబెడ్కర్ చౌరస్తా వద్ద  తలపెట్టిన సత్యాగ్రహదీక్షలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున  పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలక మధుసూదన్ రెడ్డి  విజ్ఞప్తి చేశారు.ఇట్టి కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు అనుబంధ సంఘాల  నాయకులు విధిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిరంకుశవైఖరి పై నిరసన తెలపల్సిందిగా  చిలుక మధుసూదన్ రెడ్డి కోరారు.