నరసింహారావుకు నివాళులు అర్పించిన మట్టా దయానంద్..

Published: Tuesday October 04, 2022
తల్లాడ, అక్టోబర్ 3 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామానికి చెందిన  మాజీ సర్పంచ్ గణేషుల నర్సింహారావు దశ దినకర్మ సోమవారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళిఅర్పించివారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖులు జాతీయ బిసి సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్, గణేశుల రవి, అనుముల బుద్ది సాగర్, అడపా వెంకటేశ్వరరావు, చెరుకూరి శ్రీనివాసరావు, అడపా కోటేశ్వరరావు, రమేష్,లింగనబోయిన పుల్లారావు,ఆళ్ళకుంట నర్సింహారావు మట్టా యువసేన సభ్యులు పాల్గొన్నారు.