నరసింహారావుకు నివాళులు అర్పించిన మట్టా దయానంద్..
Published: Tuesday October 04, 2022
తల్లాడ, అక్టోబర్ 3 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గణేషుల నర్సింహారావు దశ దినకర్మ సోమవారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళిఅర్పించివారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖులు జాతీయ బిసి సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్, గణేశుల రవి, అనుముల బుద్ది సాగర్, అడపా వెంకటేశ్వరరావు, చెరుకూరి శ్రీనివాసరావు, అడపా కోటేశ్వరరావు, రమేష్,లింగనబోయిన పుల్లారావు,ఆళ్ళకుంట నర్సింహారావు మట్టా యువసేన సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network: