కరోనాతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : కార్పొరేటర్ చేతన హరీష్
Published: Thursday April 29, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 28, ప్రజాపాలన ప్రతినిధి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కరోనా నిబంధనలను పాటిస్తూ, కరోనా వైరస్ వ్యాప్తి నివారించడంలో ప్రజలు భాగస్వాములు కావాలని హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ కోరారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో కార్పొరేటర్ చేతన హరీష్ డివిజన్లోని రాంరెడ్డినగర్, కామాక్షిపురం, మధురానగర్, పాశంసత్తయ్య తదితర కాలనీలలో హైపోక్లోరైడ్ ద్రావాణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖాలకు మాస్కులు, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రవి, ప్రధాన కార్యదర్శి నారాయణ దాస్, కోశాధికారి గోపాల్ యాదవ్, మరియు లింంగం, బిజెపి డివిజన్ సంయుక్త కార్యదర్శి పాశం ప్రవీణ్, ఓబిసి డివిజన్ ప్రధాన కార్యదర్శి శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: