స్వతంత్ర్య సమరయోధులు, ఇటుకుల నర్సయ్య మృతి

Published: Monday May 03, 2021
పాలేరు మీ 2 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలో. తెలంగాణ సాయుధ పోరాట యోధులు. మరియు, స్వతంత్ర్య సమరయోధులు, మల్లు స్వరాజ్యం గారి సహచరులు సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడు ఇటుకుల నర్సయ్య 90 గారు ఆదివారం ఉదయం  చెన్నారం గ్రామంలో మరణించారు. విషయం తెలుసుకున్న సిపిఎం జిల్లా నాయకులు మాజీ ఎంపీపీ రచ్చ నరసింహారావు వారి పార్ధివదేహానికీ పూలమాలవేసి నివాళులర్పించినరు అనంతరం వారి పార్థివదేహం పై పార్టీ జెండాను కప్పి ఉంచారు ఈ కార్యక్రమంలో చెన్నారం పిఎసిఎస్ అధ్యక్షులు వందనం నాగేశ్వరరావు, డైరెక్టర్ పుసులూరి బాస్కరరావు, సీపీఎం పార్టీ గ్రామ కార్యదర్శి షేక్ మధార్, నాయకులు కుమ్మరి లక్ష్మయ్య  తదితరులు పాల్గొన్నారు