దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య 37 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు
ఇబ్రహీంపట్నం మార్చి తేది 19 ప్రజాపాలన ప్రతినిధి.దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత పేద ప్రజల పెన్నిధి భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 37 వర్ధంతిసభ సిపిఎం పార్టీ యాచారం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా జరిగింది*
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పి జంగారెడ్డి హాజరై మాట్లాడుతూ. సుందరయ్య భూస్వాముల కుటుంబంలో పుట్టినాడు అయన ఎన్నో విలాస వంత మైన జీవితాలు గడపవచ్చు కానీ.అలాకాకుండా అందరు సమానంగా ఉండాలనే ఉద్దేశం తో. గ్రామాలల్లో వున్నా అసమానతలు రూపు మపాలని భూమి అందరి చేతుల్లో ఉండలని స్త్రీ పురుషులకు సమాన హాక్కులు ఉండాలని అనుకోని ఆయనకు వచ్చిన యావత్ ఆస్థిని పేద ప్రజలకు పంచిన గొప్ప ఆదర్శ నాయకుడు సుందరయ్య . తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి రజాకార్ల భూస్వాములను తరిమి కొట్టి 4 వేల గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచిన యోధుడు సుందరయ్య భూపోరాటాల ఫలితంగా అనేక బుచట్టాలు సీలింగ్ టే నెంటూ యాక్టు గైరాన్ ఫోరమ్ బోగ్ లాసంటివి వచ్చినవి.ఈ చట్టాల వలన పేదలకు భూములు వచ్చినవి . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి పేరుతోనే పేదల భూములు రికార్డులో లేకుండా చేసిన పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమల పేరుతొ కారు చౌకగా పేదల భూములు లాక్కుంటున్నారు. ధరణి వచ్చిన తర్వాత భూములు పరిష్కారం కాకుండా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది భూ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలు తీసుకొని వచ్చిన సమస్యలతో రైతులకు అండగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తాం. సుందరయ్య గారి స్ఫూర్తితో పార్టీ ఎదుగుదళ కోసం ప్రతి ఒక్కరు పని చేయాలనీ ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి మధుసూదన్ రెడ్డి. మండల కార్యదర్శి ఆలం పల్లి నర్సింహ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి అంజయ్య మండల నాయకులు పి బ్రహ్మయ్య శ్రీమన్నారాయణ కె జగన్ పి వెంకటయ్య ఏ జంగయ్య చందు లాజర్ ధర్మన్న గూడ సర్పంచి ఎం భాషయ్య వ్యవ సాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ch సత్యం.మహిళా సంఘం మండల కార్యదర్శి ఎం అరుణ కార్యదర్శులు పార్టీ సభ్యులు ప్రజా సంఘాల భద్యులు పాల్గొన్నారు.
మహనీయుడి వర్ధంతి సందర్భంగా పార్టీ క్యాండెట్ సభ్యులను పార్టీ సభ్యులుగా ప్రమోట్ చేసి ప్రమాణం చేయించడం జరిగింది
Share this on your social network: