అభివృద్ధి ప్రదాతకు పాలాభిషేకం చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ .

Published: Friday December 02, 2022
బూర్గంపాడు ( ప్రజా పాలన.) 
రోజున బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామపంచాయతీ శివారు చెరువు సింగారం  గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి ఈ గ్రామమునకు బీటీ రోడ్డు 80 లక్షల రూపాయలతో శాంక్షన్ ఇప్పించినందుకు మరియు 95 లక్షల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణము మరియు 30 డబల్ బెడ్ రూములు ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు,ఈ గ్రామం మొత్తానికి పోడు భూములు సర్వే జరిపించి పట్టాలి ఇప్పిస్తున్నందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు  శ్రీ  కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి మరియు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా  కాంతారావు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేసినారు  వీరికే మా ఓట్లు అని గ్రామస్తులు తెలిపినారు ఈ యొక్క కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొడియం ముత్యాలమ్మ  స్థానిక సర్పంచ్ కురుసం వెంకటరమణ ఎఫ్ ఆర్ సి చైర్మన్ కోసం వెంకన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెస్ కే అబ్దుల్లా వార్డు మెంబర్ చరప సత్యనారాయణ,పొట్ట వసంతరావు ,సోయం వీరస్వామి, తాటి తిరుపతి పొట్ట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు