ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి *మహత్మ జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి ఘనంగా జరిప

Published: Tuesday November 29, 2022
సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ది కోసం కృషి చేసిన గోప్ప సంఘ సంస్కర్త మహత్మ జ్యోతిరావు పూలే గారి 131 వర్ధంతి సందర్భంగా తెరాస జిల్లా నాయకులు కానుగుల మహేష్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల లో మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులు . అర్పించారు వారు మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష అంటరానితనం పై పోరాటం చేసి వెనకబడిన బడుగు బలహీనవర్గాల హక్కులు మహిళలకు విద్యవకాశం  కల్పించిన గొప్ప సంఘసంస్కర్త  సామాజిక ఉద్యమకారులు మార్గదర్శి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో  కళాశాల ప్రిన్సిపాల్ B కృష్ణయ్య గారు తెరాస సీనియర్ నాయకులు భర్తకి రాజు లకుమల్ల వేణుగోపాల్ బుట్టి మహేందర్ ఎం.  ముత్యాలు భుజంగా చారి కే. నరసింహ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు,