ఘనంగా మల్లు నందిని విక్రమార్క జన్మదిన వేడుకలు శాంతి నిలయంలో వికలాంగులకు పండ్లు పంపిణీ చేసి

Published: Monday December 05, 2022

బోనకల్, డిసెంబరు 04 ప్రజా పాలన ప్రతినిధి: సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో శాంతి నిలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా కేక్ కటింగ్ చేసి ఆశ్రమంలో మానసిక వికలాంగ పిల్లలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ అమ్మ నందిని విక్రమార్క నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, భగవంతుణ్ణి కోరుకుంటూ అమ్మా ఫౌండేషన్ ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాలను అందజేస్తూ పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నరాని మరిన్ని సేవా కార్యక్రమాలను ముందు ముందు నిర్వహించనునట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ బడే,యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఉమ్మినేని రమేశ్,సోషల్ మీడియా కో ఆర్డినేటర్ డేగల వేలాద్రి,యువజన నాయకులు ఏసూపోగు హేమూన్,దారెల్లి రాకేష్,శ్రీపాటి నాగరాజు,యంగల గౌతం,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్య శ్రీను,కొండా,వెంకట నరసయ్య,యువజన నాయకులూ జీ పున్నారావు,జనప్రీయ కుమార్,పిల్లి రాకేష్ ,రామారావు ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.