నిరుద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు : డివైఎఫ్ఐ

Published: Monday September 27, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్26, ప్రజాపాలన : నిరుద్యోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మిడిపల్లి రాజ్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వివేకవర్ధని డిగ్రీ, పీజీ కళాశాలలో (భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య) డివైఎఫ్ఐ జిల్లా ప్రథమ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అద్యక్షత వహించిన ఆయన డివైఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు రావడం లేదని అమరులైనవారికి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరిగెల మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు దేవదాస్, రాజేశ్వరి, వెంకటేష్, హరీష్, సంతోష్, నవీన్, రాజశేఖర్, జిల్లాలోని వివిధ మండలాల నుంచి డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.