ఘనంగా పౌర హక్కుల దినోత్సవం
Published: Wednesday December 01, 2021
ఇబ్రహీంపట్నం నవంబర్ 30(ప్రజా పాలన ప్రతినిధి ): మండలంలోని యామపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీ నందు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో ఎస్సి ఎస్టి లపై జరిగే సాంఘిక దురాచారాలు అసమానతలు అంటరానితనం అస్పృశ్యత వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇట్టి అంశాలపై పలువురు మాట్లాడారు. సర్పంచ్ తలారి మనీషా ఆర్ ఐ భూమేశ్ విఆర్వో రాకేష్, అంగన్వాడీ టీచర్లు, ఎస్సీ హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ, అంబేడ్కర్ సంఘం సభ్యులులు వీఆర్ఏ లు గంగాధర్ గణేష్ పాల్గొన్నారు
Share this on your social network: