కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి మేయర్ కార్పొరేటర

Published: Wednesday November 09, 2022
మేడిపల్లి, నవంబర్ 8 (ప్రజాపాలన ప్రతినిధి)
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని  కీసరగుట్టలో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో రాష్ట్ర కార్మిక&ఉపాధి కల్పనా శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు మద్ది యుగంధర్ రెడ్డి, కౌడే పోచయ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోచారం చైర్మన్ కొండల్ రెడ్డి, నాయకులు జోగిరెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.