తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Published: Monday October 03, 2022
బోనకల్ ,అక్టోబర్ 02 ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ. బ్రిటిష్ వారి బానిస పాలన నుండి భారతదేశానికి విముక్తి తీసుకురావడానికి జరిగిన స్వాతంత్ర్య పోరాటం లో గాంధీ జి ముఖ్య పాత్ర పోషించారని, శాంతి అహింసా అనే ఆయుధాలతో బ్రిటిష్ వారిని తరిమికొట్టారని,అన్నారు. నేటి యువత గాంధీజీ ఆదర్శంగా తీసుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సాదినేని హనుమంతరావు, బానోతు శివాల నాయక్, ఏసుపోగు నాగేశ్వరరావు, మన్నెపూడి గోర్కే,చితిరల వెంకటేశ్వర్లు, సండ్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.