సేవా సదనంకు నిత్యావసర సరుకులు వితరణ

Published: Monday August 02, 2021
మధిర, ఆగస్టు 01, ప్రజాపాలన ప్రతినిధి : మధిరలోని డాక్టర్ వసంతమ్మ మానసిక వికలాంగుల వసతి గృహానికి ఆదివారం అంబటి ఆశీర్వాదం జిబి ఎంఎస్ రాణి దంపతులు ఆర్థిక సహకారంతో ఏర్పాటుచేసిన నిత్యావసర సరుకులను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా సేవాసదన్ డైరెక్టర్ డాక్టర్ సుశీల మాట్లాడుతూ రిటైర్డు ఉపాధ్యాయులు స్వర్గీయ అంబటి శాంతయ్య మరియమ్మ దంపతుల జ్ఞాపకార్థం సేవా సదనంలో ఉన్న మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకులు అందజేసిన అంబటి ఆశీర్వాదం జిబిఎంఎస్ రాణి దంపతులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబటి షాలెట్ పాల్గొన్నారు