ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 5ప్రజాపాలన ప్రతినిధి *ఎంబీబీఎస్ కోర్సులో ఫ్రీ సీట్ పొందిన విద్యా

Published: Tuesday December 06, 2022

రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రావుల ఐలయ్య అలివేలు పెద్ద కుమారుడు రావుల శరత్ చంద్ర ఖమ్మం జిల్లా కొత్త గూడెం కాలేజిలో ఎంబీబీఎస్ కోర్సులో ఫ్రీ సీట్ పొందరు దానికి ప్రోత్సాహకంగా వారిని గ్రామ సర్పంచ్ మరియు పాలక మండలి తరుపున సన్మానించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ విష్ణువర్థన్ రెడ్డి  మాట్లాడుతూ ఆరుట్ల గ్రామానికి చెందిన రావుల శరత్ చంద్ర ఎంబీబీఎస్ కోర్సులో ఫ్రీ సీట్ పొందడం గ్రామానికే ఎంతో గర్వకారణమని, ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి ఇంత స్థాయికి వచ్చినందుకు వారిని అభినందించారు, అలాగే గ్రామంలోని యువకులు, విద్యార్థిని విద్యార్థులు వివిధ రంగాలలో ఎదిగి ఊరికి, కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాండాల జంగయ్య గౌడ్, ఎంపీటీసీ సభ్యులు కావలి శ్రీనివాస్, చీరాల రమేష్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం గారు, వార్డు సభ్యులు పంబల శివకుమార్, ఎన్నీదుల స్వప్న సురేష్, మానుపాటి వెంకటేష్, మాజీ సర్పంచ్లు అనంగల్ల యాదయ్య, మేగవత్ మోహన్ నాయక్, గ్రామస్థులు మాడ్గుల కృష్ణ, నూకం రాజు, సుంకరి ప్రవీణ్ గౌడ్, కాటి బీరప్ప, పొలమొని అనిల్ రాజు, వస్పరి కుమార్, జోగు జంగయ్య, మంద సుధాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.