యువత మేలుకో రాజ్యం ఏలుకో

Published: Thursday January 13, 2022

స్వామి వివేకానంద జయంతి సభలో పేట భాస్కర్ పిలుపు

కోరుట్ల, జనవరి 12 (ప్రజాపాలన ప్రతినిధి) : యువతరమా నవతరమా ఇదే అదును కదిలిరమ్ము ఇనుప కండలు ఉక్కునరాలు వజ్రాయుధం లాంటి సంకల్పంతో యువత మేలుకో రాజ్యం ఏలుకో అంటు చైతన్య స్పూర్తి రగిలించిన స్వామి వివేకానందుడు ఆలోచనలతో యువత ముందుకు రావాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ పిలుపునిచ్చారు. బుధవారం సి ప్రభాకర్ స్మారక గ్రంథాలయంలో అధ్యక్షులు చెన్న విశ్వనాథం అధ్యక్షతన జరిగిన స్వామి వివేకానందుడు 159వ జయంతి ఉత్సాహలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న  పేట భాస్కర్ మాట్లాడుతూ భారతదేశపు ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహానీయుడు స్వామి వివేకానందుడని ఆయన అడుగు జాడల్లో నేటి యువజనులు ఉవ్వెత్తున ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు సుతారి రాములు, రాస భూమయ్య, వుయ్యల నర్సయ్య, రాసకొండ పెద్ద దేవయ్య, వంశీ కృష్ణ, వి మధు, సాంబారు మహేష్, గుండేటి రవి, భూపేల్లి నగేష్, వుయ్యల శోభన్, రాజేశం, రామయ్య, వరుణ్ తదితరులు పాల్గొన్నారు