కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్ భారతి హోళికేరి

Published: Tuesday January 24, 2023
జన్నారం జనవరి 22, ప్రజాపాలన: మండలంలోని పోనకల్ గ్రామ పంచాయతీ కంటి వెలుగు శిబిరాన్ని సోమవారం మంచిర్యాల జిల్లా  కలెక్టర్ భారతి హొళీఖేరి సందర్శిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. పేద ప్రజలకు సంబంధించిన అందత్వం నుండి నివారణకు కొరకు నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. పొన్కల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జక్కు భూమేష్ ఆధ్వర్యంలో కంటి వెలుగు రెండో విడత నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అరుణరాణి, ఏపీఓ రవీందర్, ప్రభుత్వ ప్రాథమిక వైద్య మెడికల్ అధికారి ఉమాశ్రీ, మెడికల్ సిబ్బంది, బిల్ కలెక్టర్ అనిల్, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.