చిరునోముల మాజీ సర్పంచ్ మృతి

Published: Friday October 08, 2021
బోనకల్, ప్రజాపాలన ప్రతినిధి, అక్టోబర్ 7 : మండల పరిధిలోని చిరునోముల గ్రామ మాజీ సర్పంచ్ శాఖమూరి రాజశేఖర్ ఈరోజు తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించారు. రాజశేఖర్ 10 సంవత్సరాలు చిరునోముల గ్రామ సర్పంచ్ గా పనిచేసి గ్రామ అభివృద్ధికి తన కృషి ఎంతో గ్రామ అభివృద్ధికి ఉపయోగకరంగా పని చేశారు. రాజశేఖర్ మరణ వార్త తెలియగానే బోనకల్ మండల టిఆర్ఎస్ పార్టీ తరఫున మండల పార్టీ అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా ఆళ్లపాడు సర్పంచ్ మర్రి తిరుపతిరావు,  బోనకల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావుట్ల సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ మండల కమిటీ తరఫున మరియు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు.