అక్రమ గా నిల్వ ఉంచిన కలప పట్టివేత

Published: Saturday December 31, 2022
జన్నారం, డిసెంబర్ 30, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 వేల రూపాయల విలువ గల ఎనిమిది టేకు దుండగులను జన్నారం రేంజ్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా అటవీ అధికారి మాధవరావు మాట్లాడుతూ టేకు కలపను  అక్రమంగా నిల్వ ఉంచడం చట్ట విరుద్ధం  అని అట్టివారి పై  కేసులు పెడతామన్నారు.  అడవి నుండి కలపను అక్రమంగా రవాణా చేయకూడం నేరం అన్నారు. గ్రామాలలో కలపను అక్రమంగా నిలువ ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్దెల రమేష్ చింతగూడ, అరె గోపాల్ చింతగూడ, పొనకంటి, శ్రీనివాస్ చింతగూడ,  పోనకంటిచారి చింతగూడ, ఎఫ్ ఆర్ ఓ తాళ్లపేట, అటవీ సిబ్బంది, జన్నారం రేంజ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.