సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిది మేయర్ సామల బుచ్చిరెడ్డి
Published: Tuesday October 05, 2021
మేడిపల్లి, అక్టోబర్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలోని ఐఐసిటి కాలనీకి చెందిన జయలక్ష్మి మరియు భవాని నగర్ కు చెందిన ఉపేందర్ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకోగా వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి జయలక్ష్మికి రూ 60 వేలు మరియు ఉపేందర్ కు రూ 56 వేలు విడుదలైన చెక్కులను మేయర్ సామల బుచ్చిరెడ్డి తన నివాసంలో అందజేశారు.
Share this on your social network: