కార్యాలయం ఎదుట ఎల్ఐసి ఏజెంట్లు నిరసన.

Published: Friday September 02, 2022
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్01, ప్రజాపాలన:
 
ఎల్ఐసి ఏజెంట్లు న్యాయమైన డిమాండ్లు పరిస్కరించాలని కోరుతూ ఎల్ఐసి బ్రాంచ్ ముందు నిరసన కార్యక్రమంలో బాగంగా గురువారం ధర్నా చెపట్టారు. ఈ సందర్భంగా ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు జే తిరుపతయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి 7 తారీఖు వరకు జరిగే వారోత్సవాలకు ఏజెంట్లు నిరసన తెలుపుతూ పాలసీదారులకు బోనస్ పెంచాలని పాలసీల పై జిఎస్టి ఎత్తివేయాలని, పాలసీదారుల లోన్ పై వడ్డీ తగ్గించాలని, ఏజెంట్లు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆల్ ఇండియా లియాఫీ జేఏసీ పిలుపుమేరకు  నిరసన తెలిపామని పేర్కొన్నారు. ఈ క్రమంలో మంచిర్యాల్ బ్రాంచ్ లియాఫీ సెక్రెటరీ కె వెంకటేషు, ట్రెజరర్ బండి వాసు , ఎస్వీ మల్లారెడ్డి,  చుంచు సాగర్, ఇరుకుల రాజేశం ,చుంచు రాజేశం, పోలాడే రామానుజ రావు, కొలిపాక తిరుపతి, ఏజెంట్లు మిత్రులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area