మామిడిపల్లి లో కరోనా రెండో డోస్ వ్యాక్సినేషన్

Published: Tuesday November 16, 2021
బాలాపూర్ నవంబర్ 15, ప్రజాపాలన (ప్రతినిధి) : మామిడిపల్లి రంగనాయకుల కాలనీలో పదిహేను వందల ఎనభై ఆరు మంది సెకండ్ డోస్  చేసుకునే వారు ఉన్నారని సీనియర్ నాయకుడు నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి రంగనాయకుల కాలనీలో రెండో డోస్ వ్యాక్సినేషన్ ను మారి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్, బిసి సెల్ అధ్యక్షులు నీమ్మల నరేందర్ గౌడ్, కార్పొరేషన్ కార్పొరేట్ లేచే ప్రారంభించారు. ఈ సందర్భంగా నిమ్మల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ.... బాలాపూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భారత గ్రామ నవ నిర్మాణ మారి స్వచ్ఛంద సేవా సంస్థ  సహకారంతో  రంగనాయకుల కాలనీలో మొదటి డోస్ తీసుకొని  రెండో వ డోస్ కోసం పదిహేను వందల ఎనభై ఆరు మంది ఉన్నారని తెలిసి వారి కోసం నేడు ప్రత్యేకంగా  రెండవ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మారి సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్  యతం పవన్ కుమార్ యధవ్, సీనియర్ నాయకులు నిమ్మల నరేందర్ గౌడ్ మారి స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్ సాంబశివ, శివాని రెడ్డి, మోహన్, వివేక్ ,అశ్విని, మేరీ, దయావతి తదితరులు పాల్గొన్నారు.