కులమతాలను రెచ్చగొట్టే బీజేపీ పార్టీని ఓడించాలి -గూడెం మహిపాల్ రెడ్డి

Published: Tuesday October 11, 2022
చౌటుప్పల్, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి):చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో 1వ,13వ వార్డుల టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ప్రజలు చాలా మేధావులు,చైతన్య పరులని అభివృద్ధి చేసేవారికే ఓటు వేసి గెలిపిస్తారని అన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారని
కెసిఆర్ నాయకత్వం లో సంక్షేమం ఒకవైపు,అభివృధి ఒక వైపు జరుగుతున్నాయన్నారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి నిధులు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బీజేపీ నాయకులు కులలను,మతాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని,రాజ గోపాల్ రెడ్డి సొంత లాభాలు,కాంట్రాక్ట్ ల కోసం ఉప ఎన్నికలు తెచ్చారని ఆరోపించారు.మునుగోడు ప్రజలు బీజేపీ పార్టీ కి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో అధిక మెజార్టీ సాధించి అభివృద్ధిలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ వస్తె మోటర్లకి మీటర్లు పెడతారని,సంక్షేమ పథకాలు కావాలో అభివృద్ధి నిరోధక పార్టీ కావాలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.నవంబర్ 3న ప్రజలు టీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించి చారితాత్మక తీర్పు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు,ఎమ్మెల్సీ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు చింతా ప్రభాకర్,చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు,వార్డుకౌన్సిలర్లు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.