నూతన కళాకారులతో "సం'ఘర్షణ

Published: Monday May 16, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ) :
 
నూతన కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా వెంకట సాయి క్రియేషన్స్ పతాకంపై "సం"ఘర్షణ  వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత మురళీమోహన్ తెలిపారు. ఆదివారం  వెంకట సాయి క్రియేషన్స్ బ్యానర్ పై మగువ ఫేమ్ సురేష్ బాబు, గీతాలి సింగ్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న సంఘర్షణ వెబ్ సిరీస్ ముహూర్తం షాట్ ను 90 ఎం.ఎల్ దర్శకులు శేఖర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ చెస్  సెక్రటరీ కే ఎస్ ప్రసాద్ లు అతిథిగా హాజరై ప్రారంభించారు.. అనంతరం రచయిత దర్శకులు సతీష్ ,రాఘవ రాజులు మాట్లాడుతూ.. సస్పెన్స్ త్రిల్లర్ బ్యాక్ డ్రాప్  లో ఈ సిరీస్ ను చిత్రీకరించడం జరిగిందని తెలిపారు. ఒక రా ఏజెంట్ తన చుట్టూ అల్లిన వల ను ఎలా చేస్తాడు అనే అంశంతో ఈ సిరీస్ ను చిత్రీకరించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే ఈ సిరి చిత్రీకరణను పూర్తి చేసి అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ లలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఓపి వంశీ, కో డైరెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.