నిజామాబాద్ ఎంపీని కలిసిన బిజెవైఎం నాయకులు

Published: Thursday July 15, 2021
మెట్ పల్లి, జూలై 14 (ప్రజాపాలన ప్రతినిధి) : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను బుధవారం మెట్ పల్లికి చెందిన బిజెవైఎం నాయకులు కలిశారు. బీజేవైఎం మెట్ పల్లి పట్టణ నూతన అధ్యక్షుడు ఆర్మూర్ రంజీత్ తో పాటు స్థానిక బిజెవైఎం నాయకులు కలిశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా బీజేపీని బలోపేతం చేయడానికై ముందుండి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ జేఎన్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.