నిజామాబాద్ ఎంపీని కలిసిన బిజెవైఎం నాయకులు
Published: Thursday July 15, 2021
మెట్ పల్లి, జూలై 14 (ప్రజాపాలన ప్రతినిధి) : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను బుధవారం మెట్ పల్లికి చెందిన బిజెవైఎం నాయకులు కలిశారు. బీజేవైఎం మెట్ పల్లి పట్టణ నూతన అధ్యక్షుడు ఆర్మూర్ రంజీత్ తో పాటు స్థానిక బిజెవైఎం నాయకులు కలిశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా బీజేపీని బలోపేతం చేయడానికై ముందుండి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ జేఎన్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: